నిజామాబాద్ జిల్లా హోలీ పండుగ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు * నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* తెలిపారు.ఈ సందర్భంగా *పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య* జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సాంప్రదాయ పద్ధతుల్లో, సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని సూచించారు.ఈ హోలీ పండుగ నేపథ్యంలో శాంతి భద్రతల నియంత్రణ నేపథ్యంలో నిజామాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.ప్రజలు హోలీ అనంతరం చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు చేసే సమయంలో యువత తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని , అవసరమైతే అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలను గమనిస్తూ వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.జిల్లా ప్రజలంతా శాంతియుతంగా హోలీ పండుగను జరుపుకుని పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమీషనర్ కోరారు.























