ధర్పల్లి: అంబులెన్స్లో మహిళకు ప్రసవం
ఆదివారం : త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన గర్భిణి గీతను ప్రసవం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో బీబీపూర్ తండా సమీపంలో నొప్పులు తీవ్రంగా వచ్చాయి. దీంతో అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ప్రసవ ఏర్పాట్లు చేశారు.
ఈఎంటీ అవినాశ్, పైలట్ నవీన్ సహకారంతో అంబులెన్స్లోనే సురక్షితంగా ప్రసవం జరగగా, గీత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, శిశువుకు ప్రాథమిక వైద్య సేవలు అందించి, మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షిత ప్రసవం నిర్వహించిన అంబులెన్స్ సిబ్బంది అవినాశ్, నవీన్లకు గర్భిణి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

























