Homeఆరోగ్యం*పి సి పి ఎన్ డి టి జిల్లా సలహా సంఘం సమావేశం

*పి సి పి ఎన్ డి టి జిల్లా సలహా సంఘం సమావేశం

నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్బస్తపూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ  అధ్యక్షతన డిఎంహెచ్వో కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ పి సి పి ఎన్ డి టి లో నమోదు అయినా వైద్యులు మాత్రమే స్కానింగ్ మిషన్లను వాడాలి నమోదు కానీ వైద్యులు స్కానింగ్ మిషన్ల ద్వారా గర్భిణీ స్త్రీలను స్కానింగ్ చేయరాదని తెలియజేసినారు. ఏ వైద్యులు అయితే స్కానింగ్ మిషన్ కొనదలచినారో వారు ముందుగా జిల్లా వైద్యాధికారి  కార్యాలయం నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత స్కానింగ్ మిషన్ వచ్చిన ఫార్మ్ బి సర్టిఫికెట్ లో కొత్త స్కానింగ్ మిషన్ వివరాలు అలాగే దానిని ఉపయోగించే వైద్యుని వివరాలు ఉండాలి అని తెలియజేసినారు. జిల్లా వైద్యాధికారి అనుమతి లేకుండా స్కానింగ్ మిషన్లను ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి, ఒక ఆసుపత్రి నుండి ఇంకో ఆసుపత్రికి బదలాయించడం కూడా నేరమని ఇలా చేస్తే సంబంధిత వ్యక్తులపై టి సి పి ఎన్ డి టి చట్టం మరియు రూల్స్, నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలియజేసినారు. అదేవిధంగా స్కానింగ్ చేసిన తర్వాత పుట్టబోయే శిశువు అమ్మాయా, అబ్బాయా అని తెలియజేయరాదని, ఒకవేళ చట్టం నియమ నీబంధనలను ఉల్లంఘించి ఎవరైనా పుట్టబోయే శిశువు అమ్మాయి అని తెలియజేసి, వెంటనే గర్భ విచ్చిత్తి కి పాల్పడినట్లయితే వారిపై ఎంటిపి చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అన్నారు. పి సి పి ఎన్ డి టి మరియు ఎంటిపీ చట్టాలను ఉల్లంఘించడం ద్వారా సమాజంలో స్త్రీ పురుషుల యొక్క నిష్పత్తి తగ్గిపోతున్నదని పుట్టబోయే శిశువు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందరూ సమానమే అని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు రేడియాలజిస్ట్ డాక్టర్ శ్వేత, గైనకాలజిస్ట్ డాక్టర్ ఇందు ,చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రభావతి ,ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుప్రియ ,డాక్టర్ శిఖర, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రేమలత, స్వచ్ఛంద సేవ మహిళా సంఘం నుండి పద్మాసింగ్, డి హెచ్ ఈ వేణుగోపాల్ , హెచ్ ఇ ఓ సురేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సొసైటీలు, పోల్ అధికారులు ఓటరు ఔట్రీచ్ కోసం టై అప్

0
పూణే: ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) నివాసితులను చేరుకోవడానికి మరియు ఓటరు భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నికల అధికారులు...

శివమెత్తిన మహిళా శివంగులు

0
శివమెత్తిన మహిళా శివంగులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ జూన్ 19 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం మండల కేంద్ర మహిళా సంఘాల మహిళలంతా కలిసి తమకు చెందిన సంఘం...

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

సొసైటీలు, పోల్ అధికారులు ఓటరు ఔట్రీచ్ కోసం టై అప్

0
పూణే: ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) నివాసితులను చేరుకోవడానికి మరియు ఓటరు భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఎన్నికల అధికారులు...

శివమెత్తిన మహిళా శివంగులు

0
శివమెత్తిన మహిళా శివంగులు త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ జూన్ 19 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం మండల కేంద్ర మహిళా సంఘాల మహిళలంతా కలిసి తమకు చెందిన సంఘం...

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

0
పేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్... గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...
Translate »
error: Content is protected !!