నిజామాబాద్ జిల్లా నేడు ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నీ జన్కంపేట్ వద్ద గల పోలీస్ శిక్షణ కేంద్రం(CTC) లోని పరేడ్ గ్రౌండ్లో శనివారం పోలీస్ టీం మరియు జ్యూడిషియల్ టీం ల మధ్య పెండ్లి క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. మొదట టాస్ గెలిచి పోలీస్ టీం బ్యాటింగ్ ను ఎంచుకున్నారు. నిర్ణీత 12 ఓవర్ ల లో పోలీస్ టీం 8 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేశారు. పోలీస్ టీం లో బ్యాటింగ్ చేసిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్ 59 పరుగు లు చేసి నాట్ అవుట్ గా నిలిచారు. సెకండ్ బ్యాటింగ్ కు దిగిన జ్యూడిషియల్ జట్టు నిర్ణీత 11.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. ఉదయ కృష్ణ 3 ఓవర్లు వేసి ప్రతి ఓవర్ లో ఒక వికెట్ చొప్పున మూడు వికెట్లు తీశారు. జ్యూడిషల్ జట్టు పోలీస్ జట్టు పై విజయం సాధించారు. ఈ సందర్భంగా *జిల్లా జడ్జి భారత లక్ష్మి* ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మరియు రన్నరప్ టీంకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన జడ్జి క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని చెప్పారు. పోలీస్ శాఖ మరియు న్యాయ విభాగం సభ్యులు అనునిత్యం ఎంతో బిజీ గా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు పరస్పర సౌహార్దాన్ని పెంపొందించి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని జడ్జి ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా, భవిష్యత్తులో కూడా ఇలాంటి స్నేహపూర్వక మ్యాచ్లు మరిన్ని నిర్వహించాలని సూచించారు. కోర్టు లో విధులు సక్రమంగా నిర్వహించే పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డ్ జిల్లా జడ్జ్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., 1st ఎ.డి.జె హరీష మరియు IV వ ఎ.డి.జె దుర్గా ప్రసాద్ , 1వ ఎ.డి.ఎమ్ కుష్బూ , శ్రీనివాస్ , హరీష్ , అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వారెడ్డి , నిజామాబాద్ ఏసిపి బి. ప్రకాష్ , బోధన్ ఏసిపి శ్రీనివాస్ , ఆర్మూర్ ఏసిపి వెంకట్ రెడ్డి , మరియు సిఐలు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు మరియు మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లు , రాజేశ్వర్ ,దయాకర్ గౌడ్, వసంత్ తదితరులు పాల్గొనడం జరిగింది.























