బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు
మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు అమీర్ ఖురేషి ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు.
అమీర్ తండ్రి బిలాల్ ఖురేషి గత నాలుగు సంవత్సరాలుగా నందిపేట్ మండలంలోని వన్నెల్ (కే) గ్రామంలో మటన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమీర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
ఈ మేరకు బాలుడి తండ్రి బిలాల్ ఖురేషి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నందిపేట్ ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.
అమీర్ ఖురేషి ఎవరైనా కనిపించినా లేదా అతని గురించి సమాచారం తెలిసినా వెంటనే నందిపేట్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ఎస్సై వినయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

























