NEET ఎగ్జామ్ సమయం పెంపు!
ఎన్టీఏ నీట్ పరీక్షా సమయం పెంచినట్లు తెలుస్తోంది. అదనంగా 15 నిమిషాలు ఇవ్వగా.. మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. అలాగే రఫ్ వర్క్ పేజీలు నాలుగుకు పెరగనున్నట్లు సమచారం. ఎడమ చేతివాటం విద్యార్థులకు అనుకూలంగా బుక్లెట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా జూన్ 21న జరగనున్న నీట్ రీ–ఎగ్జామ్కు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు.























