సైబర్ వేధింపులపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్మార్ట్ఫోన్లు యువతులకు శాపంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సైబర్ వేధింపులు, బ్లాక్మెయిలింగ్ ఘటనలపై ఆయన స్పందిస్తూ.. సైబర్ నేరగాళ్లు అందమైన యువకులు, సినీ నటుల ఫోటోలను డీపీలుగా పెట్టి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతారని తెలిపారు. వారి మాయమాటలు నమ్మి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంచుకోవద్దని యువతులకు హెచ్చరించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు లేదా నమ్మకమైన స్నేహితులకు చెప్పాలని, డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.

























