*రాష్ట్రవ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఎందుకు స్పందించడం లేదు*
*తాజాగా నగరంలోని గోపాల్ బాగ్ గోశాలలోని పురాతన శివాలయంలో విగ్రహాల దాడి వెనుక ఉన్న వారిపై జిల్లా యంత్రాంగం తక్షణమే చర్యలు చేపట్టాలి*
*అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిమాండ్*
ఇందూరు అర్బన్..
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మరియు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హిందూ ఆలయాలపై, హిందూ దేవతా మూర్తులపై దాడులు జరగడం హేయమైన చర్య అని ముస్లింలు హిందూ ఆలయాలను టార్గెట్ చేసుకొని హిందూ ఆలయాలు మరియు హిందూ దేవతా విగ్రహాలపై దాడులు జరగడాన్ని హిందువులందరూ గమనిస్తున్నారని ఒక్కసారి కాషాయ దళం రెచ్చిపోతే జరిగే నష్టానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వారితో పాటు లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. గోపాల్ బాగ్ లో పురాతన శివాలయం పై గత మూడు రోజుల క్రితం జరిగిన ఈ విగ్రహాల ధ్వంసం ఘటనపై పోలీసులు కనీసం నిందితులను పట్టుకోవడంలో వైఫల్యం చెందారని అన్నారు. ఈ 80 ఎకరాల గోశాల స్థలంలో కొందరు ముస్లింలు కబ్జాలకు కూడా పాల్పడ్డారని దీనిపై వెంటనే కలెక్టర్ మరియు రెవిన్యూ సిబ్బంది స్పందించి ఈ కబ్జాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఈ శివాలయం పక్కనే గల గోశాలలో 150 ఆవులు ఉన్నాయని, దేవతా విగ్రహాలకే భద్రత లేని ఈ పరిస్థితుల్లో గోమాతలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఎమ్మెల్యే గారు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక హిందూ ఆలయాలపై మరియు దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెట్రేగిపోతున్నాయని విమర్శించారు. అలాగే హిందూ అమ్మాయిలపై లవ్ జిహాద్ పేరిట జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మిగతా మంత్రులు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమది సెక్యులర్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ వారు అంటూ ఉంటారని సెక్యులర్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సెక్యులర్ పార్టీ అంటే బిజెపి పార్టీ అని, మా పార్టి కేవలం ఒక హిందువులే కాకుండా దేశంలో ఉన్న అన్ని మతస్తులతో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ మరియు సబ్ కా ప్రయాస్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు వెళ్తుంది అని అన్నారు.
ముస్లింల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అందుకే హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా గాని వారి నోటి నుండి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలు రోజురోజుకు రెచ్చిపోతున్నారని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ అధికారిక యంత్రాంగంతో వీటిని నియంత్రించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా నిఘా పెట్టి ఇకపై ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని లేకపోతే జరగబోయే నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ భద్రతా వ్యవస్థనే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

























