Homeత్రిశూల్ న్యూస్ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

జ్యోతిబాపూలే బాలికల గురుకులాలలో వైద్య ఆరోగ్య శిబిరం సందర్శన


నిజామాబాద్ మార్చి 20: ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు. మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద గల మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను రోజువారీగా తరలించేందుకు వీలుగా స్వచ్చ ఆటోను పాఠశాలకు పంపాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. గురుకులంలోని కిచెన్ ను, విద్యార్థినుల కోసం వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. నాణ్యమైన సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.     ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. వివిధ విభాగాల వారీగా విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, చక్కటి ఆరోగ్యం కోసం ఆకు కూరలు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, వెంటనే నిర్వాహకుల దృష్టికి తీసుకురావాలని, అశ్రద్ధ చేయకూడదని అన్నారు. సరైన ఆహార నియమాలను పాటిస్తూ, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని విద్యార్థినులకు మార్గనిర్దేశం చేశారు. ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా, వార్షిక పరీక్షలను ఆత్మవిశ్వాసంతో చక్కగా రాయాలని సూచించారు. బాలికల భద్రత, రక్షణ, ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని, బయటి వ్యక్తులు ఎవరూ పాఠశాల లోనికి రాకుండా గట్టి పర్యవేక్షణ చేయాలని పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్వేత, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, వైద్యులు సందీప్, శశిధర్, అరవింద్ తదితరులు ఉన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

MSRDC క్రాస్‌విండ్‌లను పరిష్కరించడానికి ఈవే యొక్క కొత్త లింక్ బ్రిడ్జ్‌పై విండ్ బారియర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది

0
టైగర్ వ్యాలీ మీదుగా 650 మీటర్ల పొడవైన తీగల వంతెనపై అడ్డంకులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పూణే: మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే యొక్క...

ఇగత్‌పురి సమీపంలో ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు 5 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

0
పూణె: ఇగత్‌పురికి సమీపంలోని ముండే గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ...

ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని సిజెపికి చెందిన అభిజీత్ దీప్కే అన్నారు

0
పుణె: ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పు లేదని పేర్కొంటూ, గురువారం సాయంత్రం పూణెలో తమ నిరసన సందర్భంగా బొద్దింక జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు...

జూన్ 20న జంతర్ మంతర్ 2.0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీని విడిచి వెళ్లనని బొద్దింక...

0
పూణేలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) క్యాంపస్‌లో శాంతియుత నిరసనతో పాటు గ్రూప్ తన విద్యా మేనిఫెస్టోను ఆ రోజు విడుదల చేస్తుందని డిప్కే చెప్పారు....

లావణి, డ్రాగ్ మరియు డ్రామా: పూణే సత్రంగ్ ఫెస్ట్ క్వీర్ కథలను జరుపుకుంటుంది

0
అహోన్ గూప్తు తీసిన డ్రాగ్ డ్రామా 'ఐటెమ్' నుండి దృశ్యాలు (ఫోటో క్రెడిట్: నయనతార మజుందార్) పూణె: ఈ జూన్‌లో ఆరు రోజుల పాటు, సత్రంగ్ మహోత్సవ్ 2026 భారతదేశం అంతటా...

MSRDC క్రాస్‌విండ్‌లను పరిష్కరించడానికి ఈవే యొక్క కొత్త లింక్ బ్రిడ్జ్‌పై విండ్ బారియర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది

0
టైగర్ వ్యాలీ మీదుగా 650 మీటర్ల పొడవైన తీగల వంతెనపై అడ్డంకులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పూణే: మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MSRDC) ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే యొక్క...

ఇగత్‌పురి సమీపంలో ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు 5 గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది.

0
పూణె: ఇగత్‌పురికి సమీపంలోని ముండే గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ట్రక్కు చెడిపోవడంతో ముంబై-ఆగ్రా హైవేపై దాదాపు ఐదు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ...

ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని సిజెపికి చెందిన అభిజీత్ దీప్కే అన్నారు

0
పుణె: ప్రజా ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడంలో తప్పు లేదని పేర్కొంటూ, గురువారం సాయంత్రం పూణెలో తమ నిరసన సందర్భంగా బొద్దింక జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు...

జూన్ 20న జంతర్ మంతర్ 2.0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఢిల్లీని విడిచి వెళ్లనని బొద్దింక...

0
పూణేలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (SPPU) క్యాంపస్‌లో శాంతియుత నిరసనతో పాటు గ్రూప్ తన విద్యా మేనిఫెస్టోను ఆ రోజు విడుదల చేస్తుందని డిప్కే చెప్పారు....

లావణి, డ్రాగ్ మరియు డ్రామా: పూణే సత్రంగ్ ఫెస్ట్ క్వీర్ కథలను జరుపుకుంటుంది

0
అహోన్ గూప్తు తీసిన డ్రాగ్ డ్రామా 'ఐటెమ్' నుండి దృశ్యాలు (ఫోటో క్రెడిట్: నయనతార మజుందార్) పూణె: ఈ జూన్‌లో ఆరు రోజుల పాటు, సత్రంగ్ మహోత్సవ్ 2026 భారతదేశం అంతటా...
Translate »
error: Content is protected !!