జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనీ ఉప వైద్యాధికారులు ప్రోగ్రాం అధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఆర్ బి ఎస్ కే వైద్యులు మరియు వైద్య సిబ్బందికి జూమ్ ద్వారాజాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా స్పెషాలిటీ డాక్టర్ల తో నిర్వహించే క్యాంపులను విజయవంతం చేయాలని స్పెషాలిటీ ఆధారంగా రోగుల నమోదు చేయాలని తెలియజేశారు. జిల్లా కలెక్టర్ పిహేచ్ స్సీ లను, ఆరోగ్య కేంద్రాలని ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు అందరూ జాగ్రత్తగా మీ మీ విధులు నిర్వహించాలని,
క్షేత్రస్థాయిలో సిబ్బంది అందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరియు ఆరోగ్య ఉప కేంద్రాల్లో సమయపాలన పాటించాలని, వారి వారి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా పిహెచ్సి స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని తెలియజేశారు.NCD లో భాగంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయాలని అన్నారు. లైను లిస్టు ఆధారంగా ఓల్డ్ కేసులు అన్నింటిని మెడికల్ ఆఫీసర్ స్క్రీనింగ్ చేయాలన్నారు. మినిస్టీరియల్ స్టాప్ వారి వారి ఒరిజినల్ ప్లేస్ లో విధులు నిర్వహిస్తూ అటెండెన్స్, లీవ్ రికార్డు, మూమెంట్ రిజిస్టర్ లను నిర్వహించాలన్నారు.మాతా,శిశు ఆరోగ్యాన్ని కాపాడుతూ మాతృ మరణాలు, శిశు , చిన్నపిల్లల మరణాలు జరగకుండా చూడాలని, గర్భిణీ స్త్రీలందరికీ నాలుగు విడతల్లో పరీక్షలు నిర్వహించాలని, పెండింగ్ లో ఉన్న గర్భిణీ స్త్రీల జాబితాలను సేకరించి ఫాలో అప్ చేయాలన్నారు. ఈ ఆరోగ్యంలో ఓపి తక్కువగా నమోదు కాకుండా చూడాలన్నారు. 30 సంవత్సరాలు పైబడిన అందరికీ ABHA card జనరేషన్ చేయాలన్నారు. ABAS అటెండెన్స్ అన్ని ఆరోగ్య కేంద్రాల్లో 100% సిబ్బంది చేయాలన్నారు. ప్రమాదకర లక్షణాలు గల గర్భిణీ స్త్రీలను గుర్తించి ప్రత్యేక పర్యవే క్షణ చేయాలని ,ప్రసవ ప్రణాళికను పగడ్బందీగా నిర్వహించాలని కోరారు. అర్హులైన శిశువులందరికి 100% వ్యాధినిరోధక టీకాలు ఇప్పించాలని పెండింగ్ లో ఉన్న శిశువుల జాబితా సేకరించి పర్యవేక్షణ చేయాలన్నారు. ఎమ్మార్ వ్యాక్సిన్ మొదటి డోసు మరియు ఫుల్ ఇమ్యూనైజేషన్ రెండు హెచ్ఎంఐ ఎస్ లో సమానంగా ఉండాలన్నారు.జీవన శైలి వ్యాధుల నియంత్రణలో మెడికల్ ఆఫీసర్ లాగిన్ లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ప్రోగ్రాం అధికారులు వారి వారి ప్రోగ్రాం లపై నివేదికల ఆధారంగా సమీక్షించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకన్న, డాక్టర్ శిఖరా, డాక్టర్ శ్రావ్య, డి పిఓ విశాల, డి డి ఎం నారాయణ, పృథ్వి ,డిహెచ్ఇ ఘన్పూర్ వెంకటేశ్వర్లు క్వాలిటీ మేనేజర్ రాము పాల్గొన్నారు.

























