*హనుమాన్ జంక్షన్ లోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ*
ఇందూరు అర్బన్..
హిందూ ధర్మం కాపాడడం కోసం హిందూ సైన్యమంతా ఏకమై మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. హిందువులు వారి వారి ఇష్టానుసారంగా వివిధ పార్టీలలో ఉన్నప్పటికీ వారి అంతిమ లక్ష్యం మాత్రం హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ లో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఒకప్పుడు ఇందూరులోని వినాయక్ నగర్ లో ప్రత్యేకంగా ఏర్పడిన ఈ హనుమాన్ ఆలయం వల్ల ఈ ప్రాంతం హనుమాన్ జంక్షన్ గా పిలువ పడుతుందని అన్నారు. అది ఈ ఆలయానికి ఉన్న గొప్పతనం అని పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడి ప్రాంత వాసులు ముందుకు వచ్చి ఒక్కొక్కరి వద్ద చెందాలు జమ చేసి 54 ఫీట్ల భారీ హనుమాన్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారని ఇది ఇందూరుకే గర్వ కారణమని కొనియాడారు. నిజామాబాద్ లోని ప్రముఖ ఆలయాలలో ఈ ఆలయం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. అఖిలభారత హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ మంగళ శాసనములతో హనుమాన్ దీక్ష స్వాములకు ప్రతినిత్యం బిక్ష (అన్నదాన ప్రసాదం) చేయబడుతుందన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తులకు ఎమ్మెల్యే తన స్వ హస్తాలతో భోజనాన్ని వడ్డించారు.

























