జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఎంహెచ్వో డాక్టర్ బి రాజశ్రీ మాట్లాడుతూ మహిళలు ఓర్పు, ఓపికతో, సహనంతో ,ఇంట్లో మరియు ఆఫీసులో అంకితభావంతో పని చేయడం వల్లే ఈరోజు ప్రభుత్వ శాఖలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. అదేవిధంగా మహిళలకు సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడం వల్లే పురుషులతో పాటు అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. విద్యార్థి దశ నుండి విలువలతో కూడిన విద్య ను, మహిళ పట్ల గౌరవం కలిగిన విలువలను అందించాలన్నారు. ఈ సందర్భంగా పాలనాధికారి డిఎంహెచ్ఓ ని శాలువాతో సత్కరించడం జరిగింది. మరి అదే విధంగా కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగులందర్నీ డీఎంహెచ్వో మరియు పాలనాధికారి సుమంత్ కుమార్ చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రావ్య,డాక్టర్ ప్రవీణ్ కార్యాలయ సూపరిండెంట్ పద్మ, సూర్యనారాయణ, డిపిఓ విశాల, డిహెచ్ఈలు ఘనపూర్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ , నాగరాజు, సురేష్, హనుమాన్లు, రాము వినోద్, సందీప్ , సుమ, సృజన, చందన, అనురాధ గంగమణి, రేఖ ,సంధ్య , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.























