కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీంగల్ పురపాలక కార్యాలయంలో ఈరోజు కల్యాణ లక్ష్మి(11), షాదీ ముబారక్(04) పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 15 చెక్కులను లబ్ధిదారులకు .ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బోదిరే నాగమణి స్వామి కౌన్సిలర్లతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, కౌన్సిలర్లు మమ్మద్ అంజుమ్ అలీ, తోట సతీష్, నీలం రవి, ప్రజాప్రతినిధులు జె జె నరసయ్య, ఆరేపల్లి నాగేంద్రబాబు, లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

























