చౌడేశ్వరి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బొంపల్లి నితీష్…
రాఖీ పౌర్ణమి సందర్భంగా వేల్పూర్ మండల కేంద్రంలోని చౌడేశ్వరి మాత ఆలయంలో గత ఐదు రోజులుగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు సుభాష్ తెలిపారు.
ప్రతిరోజూ ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ, హారతి, నైవేద్యాలను సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో భజన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో దేవాంగ సంఘ కుటుంబ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొంటున్నారని అధ్యక్షుడు సుభాష్ తెలిపారు.

























