రోడ్డు మరమ్మతులను పట్టించుకోని అధికారులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బొంపల్లి నితీష్…
వేల్పూర్ మండలంలోని మోతే వేల్పూర్ మధ్య రహదారిలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ గుంతలు ఏర్పడడంతో ఈరోజు ఉదయం బైకు స్కిడ్ అయ్యి తండ్రి కూతుర్లకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు మోతే గ్రామ యువకులు సిమెంటు కంకరతో ఆ భారీ గుంతలను వారి సొంత ఖర్చులతో పుడ్చారు.అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన ఫలితం లేకపోవడంతో మేమే గుంతలను పుడ్చమని ఆ యువకులు తెలిపారు. యువకులు చేసిన పనికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు ఇకనైనా స్పందించి ఆ గుంతలను పూడ్చి వేయాలని కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో సుమన్, శ్రీనాథ్, భరత్, రంజిత్ పాల్గొన్నారు.























