విద్యానగర్లో చెత్త కుప్పలు.. ఇబ్బందుల్లో ప్రజలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై చెత్త కుప్పలు ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడటమే కాకుండా దుర్వాసనతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.
చెత్త కారణంగా ఈగలు, దోమలు పెరిగి పరిసరాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో చెత్తతో పాటు నీరు నిలిచిపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు తొలగించి, కాలనీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యానగర్ వాసులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చెత్తను తొలగించి, రోడ్లను శుభ్రం చేయడంతో పాటు క్రమం తప్పకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

























