* ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి
* శ్రీరాముడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు
శ్రీరామనవమి వేడుకలు ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని *నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి* పేర్కొన్నారు. ఈ మేరకు నియోజకవర్గ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలియజేశారు. సీతారాముల ఆశీస్సులు నియోజకవర్గ ప్రజల పై ఉండాలని ఆకాంక్షించారు. ఇతిహాసాల్లో పేర్కొనబడినట్లు సీతారాముల జీవితాలను నేటితరం వారు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

























