తెలంగాణలో కొత్తగా మరో 2 లక్షల మందికి పెన్షన్లు
తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. చేయూత పథకం కింద మరో 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా 2026-27 వార్షిక బడ్జెట్లో రూ.233 కోట్లు కేటాయించడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే లక్షల దరఖాస్తులు రాగా, లబ్ధిదారుల ఎంపిక కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు త్వరలోనే వడబోత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.























