ధర్పల్లి: ఐదు గ్రామాల్లో 819 ఎకరాల్లో పంట నష్టం
ఆదివారం : 05/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలంలో కురిసిన అకాల వర్షాలకు ఐదు గ్రామాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. ధర్పల్లి, గోవిందుపల్లి, దమ్మన్నపేట్, కేసారం, రామడుగు గ్రామాల్లో సుమారు 480 మంది రైతులకు చెందిన 819 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు. ఈ వివరాలను జిల్లా అధికారులకు నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు.

























