Homeతెలంగాణపోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత

పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత

*పోలీసుల నిర్బంధం నుంచి ఉద్యమకారులను విడిపించిన కల్వకుంట్ల కవిత*

*కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని కోరుతూ చలో సెక్రటేరియట్ చేపట్టిన తెలంగాణ ఉద్యమకారులు*

*600 మందికి పైగా ఉద్యమకారులను అరెస్ట్ చేసి వివిధ ఠాణాల్లో నిర్బంధించిన పోలీసులు*

*మెహదీపట్నం పోలీస్ స్టేషన్ లో ఉద్యమకారులకు సంఘీభావం తెలిపిన కల్వకుంట్ల కవిత*

*ఉద్యమకారులను విడిచిపెట్టే వరకు అక్కడే ఉంటామని ఠాణాలో బైఠాయింపు*

*ఉద్యమకారులను విడిపించుకొని బయటకు వచ్చిన జాగృతి అధ్యక్షురాలు*


హైదరాబాద్ : పోలీసుల నిర్బంధంలో ఉన్న 600 మందికి పైగా తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విడిపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం చలో సెక్రటేరియట్ కు బయల్దేరారు. పోలీసులు వారిని అడ్డుకొని మెహదీపట్నం, నాంపల్లి, పంజాగుట్ట సహా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉద్యమకారులను అరెస్ట్ చేసిన సమాచారం అందుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మధ్యాహ్నం హుటాహుటిన మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఠాణాలో పోలీసుల నిర్బంధంలో ఉన్న ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు. అక్కడి నుంచే ఇతర పోలీస్ స్టేషన్లలో ఉన్న ఉద్యమకారులతో ఫోన్ లో మాట్లాడారు. అరెస్ట్ చేసిన వారందరినీ విడిచిపెట్టే వరకు తాను పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేది లేదని అక్కడే బైఠాయించారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి అరెస్ట్ చేసిన ఉద్యమకారులందరినీ విడిపించారు. మెహదీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి ఉద్యమకారులను వెంటబెట్టుకుని బయటకు వచ్చారు.

*హామీలు నెరవేర్చకుంటే ప్రజల్లో తిరగలేరు*

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్ లీడర్లు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉండదని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఆ పార్టీ నాయకులు బయట తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. వారికి ఇస్తామనన్న భూమి, పెన్షన్ సహా ఇతర హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఇంకా ఉద్యమకారులు తమ డిమాండ్ల సాధన కోసం చలో సెక్రటేరియట్ కు వెళ్లడం, పోలీసులు వారిని అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితి రావడం దురదృష్టమన్నారు. రాష్ట్ర సాధనలో ముందున్న ఉద్యమకారులకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లో సరైన గౌరవం దక్కలేదన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

*భూములు ఇవ్వకపోతే ఆక్రమించుకుంటాం*

అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కవిత గుర్తు చేశారు. ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లతో పాటు అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్న ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీలో ఉద్యమకారుల కోసం బిల్లు పెడతామని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న ఉద్యమకారులకు వారి హక్కులను సాధించుకోవటం పెద్ద కష్టం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఇంటి స్థలాలు ఇవ్వకుంటే భూ పోరాటాలు చేసి భూమి ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో భూ పోరాటాలు ప్రారంభించిందని.. మున్ముందు ఉద్యమకారులతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...
Translate »
error: Content is protected !!