ధర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాదె నరేష్ నియామకం
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి, జూన్ 22 (త్రిశూల్ న్యూస్):ధర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చల్లగారిగె గ్రామ సర్పంచ్ గాదె నరేష్ సోమవారం నియమితులయ్యారు.
ఈ సందర్భంగా గాదె నరేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, పీసీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ బలోపేతమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాదె నరేష్కు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

























