నందిపేటలో ఘనంగా యోగా డే….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూన్ 21 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అలాగే స్థానిక సాంకేతిక కళాశాలలో కూడా యోగా దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు అంతా కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా యోగా గురువులు మాట్లాడుతూ…. యోగ అనేది మన భారతదేశపు తరగని ఆస్తి అని, యోగ మనదేశంలో పుట్టడం మనకెంతో గర్వకారణమని, యోగ అనేది మానవాళికి ఆరోగ్యపరంగానే కాక ఆలోచన పరంగా కూడా ఒక దిక్సూచి లాంటిదని, అందుకే ఈరోజు యోగాకు గొప్ప పేరు వచ్చిందని, ప్రపంచ దేశాలు సైతం యోగాతో ఫలితాలను పొందేందుకు యోగాసనాల ద్వారా తమ ఇష్టతను తెలియజేస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలకు యోగా ఒక వరం లాంటిదని, ఆ యోగా ప్రకృతితో ముడిపడి ఉందని అందుకే యోగా వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయని, మన దైనందిత జీవితంలో చెడు అలవాటును దూరం చేసేందుకు, మనసును కేంద్రీకృతం చేసేందుకు యోగ అనేది ఒక దివ్య ఔషధంగా ఉపయోగపడుతుందని కొనియాడారు. అందుకే నేడు మహా మహా మేధావులు, ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు, ఋషులు, యోగులు, ప్రముఖులందరు యోగాతోనే తమ దిన చెయ్యను ప్రారంభిస్తారని అందుకే వారు ప్రశాంతతతో తయారు సాధిస్తారని అన్నారు. హోమియోపతి వైద్యురాలు డాక్టర్ ప్రవీణా, యోగ గురువులు అన్నపూర్ణ, నాగార్జున, మండల కేంద్ర ప్రముఖులు, బీజేవైఎం నాగ సురేష్, బిజెపి మండల అధ్యక్షులు పటేళ్ల రాజు, మాజీ ఉపసర్పంచ్ భరత్, పెయింటర్ రాజు, బుక్ స్టాల్ శ్రీను ,ఎర్రం లింగం, వన్నెల్ శ్రీను , వైద్య సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.























