ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో యోగా, ధ్యానంపై అవగాహన కార్యక్రమం
సోమవారం : 22/06/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల కేంద్రంలోని పీఎం శ్రీ ఆదర్శ పాఠశాలలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా, ధ్యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్రహ్మకుమారి రేణుక అక్కయ్య, క్యాదరి శ్రీనివాస్ విద్యార్థులకు యోగా, మెడిటేషన్ ప్రాముఖ్యతను వివరించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు.
పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతిరోజూ యోగా, ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

























