ధర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి నిర్వహణ
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి, జూన్ 23: ధర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ, దేశ సమైక్యత కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేసి, దేశ సమగ్రతను మరింత బలోపేతం చేసిందని తెలిపారు. దీంతో కాశ్మీర్ పూర్తిస్థాయిలో భారతదేశ ప్రధాన ప్రవాహంలో కలిసిందని, డాక్టర్ ముఖర్జీ కల సాకారమైందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల బీజేపీ కార్యదర్శి సరిచంద్, కర్కా గంగారెడ్డి, చిలుక మహేష్, పాల్దాస్తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

























