ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూన్ 24 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర రాంనగర్ లో నివాసం ఉంటున్న ఐలాపూర్ వాస్తవ్యురాలు పిస్క సుజాత 50 సం.లు భర్త పిస్క చరణ్, కులము :పద్మశాలి, వృత్తి బీడీలు చుట్టుట, మృతురాలికి ముగ్గురు కుమారులు వృత్తిరీత్యా వేరే గ్రామాలలో పనిచేసుకుంటున్నారు, అయితే మృతురాలు సుజాత బుధవారం దాదాపు 11 గంటల ప్రాంతంలో ఇంట్లోనే పూలకు సంబంధించిన పూజా సామాగ్రిని పడేసేందుకు ఇంటికి దగ్గర్లో ఉన్న రాంనగర్ రామాలయం పక్కనగల పెద్ద చెరువు( రఘునాథ చెరువు) లోకి వెళ్లి చెత్తను పడేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడడంతో మృతి చెందడం జరిగిందని, మృతురాలి భర్త చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, డెడ్ బాడీని పంచనామా నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగిందని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.























