నందిపేటలో అగ్ని ప్రమాదం….
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూన్ 24 త్రిశూల్ న్యూస్. మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నందిపేట మండల కేంద్ర గ్రామ పంచాయతీ ప్రక్కనగల ఏశాల చిన్న చిన్నయ్య ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. తను నివసించే పక్కనగల తన ఇంటి భాగంలో దాదాపు 200 కట్టల గల వరిగడ్డిని నిలువ చేసి ఉంచాడు. ఎలా జరిగిందో ఏమో కానీ ఆ ఇంట్లో నుండి దట్టమైన పగలు రావడంతో స్తానికులంతా ఒక్కసారిగా అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన గడ్డి కట్టలు ఇంట్లో ఉండడం వల్ల దట్టమైన పొగ వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక యువత అంతా కలిసి గడ్డిమోపులను అన్నిటిని బయటకు లాగేసి మండలాలు ఆర్పివేయడం జరిగింది. దాదాపు 50 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.ఇండ్లలో, ఇంటి స్లాబ్లా పైన వరిగడ్డి నిలువ చేయకూడదని, షార్ట్ సర్క్యూట్ వల్ల, వరిగడ్డి లోపల విపరీతమైన హిట్ జనరేట్ అవుతుందని దానివల్ల కూడా మంటలు వ్యాపించవచ్చని అగ్నిమాపక సిబ్బంది విజ్ఞప్తి చేశారు.























