*ప్రజల ప్రాణాలతో ‘ఆర్ఎంపీ’ల పి ఎంపీల’ చెలగాటం!**
**నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ల నిర్వహణ.**
**అడ్డగోలుగా యాంటీబయాటిక్స్, వాడకం.**
* **డ్రిప్పులు, ఇంజక్షన్లతో కాసుల వేట.**
నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామంలో
గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్సకు పరిమితం కావాల్సిన ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) వైద్యులు తమ పరిధిని మించి వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కేవలం ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే అనుమతి ఉన్న వీరు, తెలిసి తెలియని వైద్యంతో సామాన్య ప్రజలను ముంచేస్తున్నారు, వీరి ట్రీట్మెంట్ పరిధిని ఎలాగైనా కట్టడి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
గంటల తరబడి సెలైన్లు ఎక్కించడం, వయసుతో సంబంధం లేకుండా కూడా ట్రీట్మెంట్ చేయడం సర్వసాధారణమైపోయింది. చిన్నపాటి జ్వరం వచ్చినా చాలు.. హై డోస్ యాంటీబయాటిక్స్ వాడి రోగుల రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తున్నారు.
**యాంటీబయాటిక్స్తో ముప్పు!**
వైద్య పరిజ్ఞానం లేకుండానే షెడ్యూల్-హెచ్ (Schedule-H) రకానికి చెందిన శక్తివంతమైన యాంటీబయాటిక్స్ను రోగులకు ఇస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఆ రోగికి ప్రాణాపాయ స్థితి కలిగినప్పుడు ఏ మందులూ పని చేయని (Antibiotic Resistance) పరిస్థితి ఏర్పడుతోంది. అడ్డగోలుగా ఇచ్చే ఇంజక్షన్ల వల్ల రియాక్షన్లు వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. అయినప్పటికీ, వీటిపై పర్యవేక్షణ కరువైంది.
### **కాసుల కోసమే డ్రిప్పులు..**
చాలామంది ఆర్ఎంపీలు పీఎంపీలు రోగి రాగానే లక్షణాలతో సంబంధం లేకుండా సెలైన్ బాటిల్స్ ఎక్కించడాన్నే ప్రాధాన్యతగా పెట్టుకుంటున్నారు. కేవలం ఫీజులు దండుకోవడానికే ఈ ‘డ్రిప్పుల’ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే పై ఆసుపత్రులకు పంపాల్సింది పోయి, తమ వద్దే గంటల తరబడి ఉంచుకుని పరిస్థితి విషమించాక చేతులెత్తేస్తున్నారు.
మండలాలలో,గ్రామాల్లో విచ్చలవిడిగా వెలుస్తున్న ఈ అక్రమ క్లినిక్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు (DM&HO) అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఉన్నతాధికారులు స్పందించి, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న అర్హత లేని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

























