బాధిత కుటుంబాలను పరామర్శించిన ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
కమ్మర్పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
చౌట్పల్లి గ్రామానికి చెందిన హన్మంత్ కుమారుడు హర్షవర్ధన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సునీల్ కుమార్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అనంతరం కోన సముందర్ గ్రామానికి చెందిన చేంగల్ నర్సయ్య ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలుసుకుని, ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచ్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

























