రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం
*ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో రక్తం అందజేత*
*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు*
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలోఆపరేషన్ నిమిత్తమై బోయ నవనీత కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో సింగరాయపల్లి గ్రామానికి చెందిన విట్టల్ గౌడ్ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారికి కావాల్సిన రక్తాన్ని అందజేయడం కోసం నిరంతరంగా ప్రయత్నిస్తున్నామని రక్త దాతల సహకారంతో మాత్రమే సకాలంలో రక్తాన్ని అందజేయడం జరుగుతుందని అన్నారు. సకాలంలో రక్తం దొరక్కపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన అధికం విట్టల్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

























