నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశానుసారముగా నిజామాబాద్ భరోసా కేంద్రం కోఆర్డినేటర్ మరియు సపోర్ట్ పర్సన్–2 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమాలకు VI టౌన్ పోలీస్ స్టేషన్కు చెందిన ASI ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ అవగాహన కార్యక్రమాలు ZPHS స్కూల్ – ఆర్సపల్లి మరియు MPPS స్కూల్ – ఆర్సపల్లి లో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రింది అంశాలపై అవగాహన కల్పించబడింది:
• ఫిల్లిస్ క్రిస్టల్ పద్ధతి – గోల్డెన్ సర్కిల్, భయాన్ని తగ్గించేందుకు స్టార్ టెక్నిక్
• భరోసా కేంద్రం సేవలు మరియు వాటిని ఎలా సంప్రదించాలి
• POCSO చట్టం మరియు దానిలో ఉన్న శిక్షలు
• విద్య యొక్క ప్రాముఖ్యత మరియు కొన్ని కేస్ స్టడీలు
• సోషల్ మీడియా ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు
• సేఫ్ టచ్ మరియు అన్సేఫ్ టచ్ గురించి అవగాహన
• సైబర్ క్రైమ్ గురించి సమాచారం మరియు T-Safe App వినియోగం
• అత్యవసర హెల్ప్లైన్ నంబర్లు
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు భద్రత, చట్టాలపై అవగాహన మరియు జాగ్రత్తలు గురించి స్పష్టమైన సమాచారం అందించబడింది.కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భరోసా కేంద్రం, నిజామాబాద్






















