ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాయిసింగ్ కుమారుడి వివాహం ఇటీవల జరగా… నూతన వధూవరులను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శనివారం వెంగల్ పాడ్ గ్రామానికి వెళ్లి కొత్త జంటను అక్షింతలు వేసి దీవించారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.
*బాబూరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మల్యే *
వెంగల్ పాడ్ గ్రామానికి చెందిన హోటల్ బాబురావు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మల్యే డా.ఆర్. భూపతి రెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎమ్మల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పార్టీ ఇందల్వాయి మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్,చింతల కిషన్, లారీ గంగారెడ్డి, ఉమ్మాజి నరేష్,రాంచందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

























