Homeత్రిశూల్ న్యూస్కామ్రేడ్ భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురు ల 95వ వర్ధంతి సందర్భంగా  తె.యూలో PDSU...

కామ్రేడ్ భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురు ల 95వ వర్ధంతి సందర్భంగా  తె.యూలో PDSU విప్లవ నివాళి

కామ్రేడ్ భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజగురు ల 95వ వర్ధంతి సందర్భంగా 

*తె.యూలో PDSU విప్లవ నివాళి*


ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో భారత జాతీయోద్యమ వీరులు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95 వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందు కామ్రేడ్ భగత్ సింగ్ చిత్రపటానికి విప్లవ నివాళి అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా *తె.యూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాంబాబు మాట్లాడుతూ*

భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూ నూనూగు మీసాల నవయవ్వనంలోనే ఉరికొయ్యలకు వేలాడిన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు ల ప్రాణ త్యాగాలు వెలకట్టలేనివని, వారి పోరాట స్ఫూర్తి నేటి విద్యార్థి, యువతకు సదా ఆదర్శమన్నారు.

*PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ మాట్లాడుతూ*

దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత జాతీయ ఉద్యమ వీరుల ఆకాంక్షలను పూర్తిగా విస్మరిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా అగ్రరాజ్యానికి తాకట్టు పెడుతూ, దేశ సంపదను స్వదేశీ, విదేశీ కార్పోరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ బద్ధ సంస్థలను చెప్పు చేతుల్లో పెట్టుకొని దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ, పౌరుల ప్రజాస్వామిక హక్కులను, భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తిని, దేశ లౌకిక వ్యవస్థను విచ్చిన్నం చేసే కుట్రలకు పాల్పడుతున్నదన్నారు.

నూతన జాతీయ విద్యా విధానం- 2020 పేరిట విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం, ప్రశ్నించే తత్వాన్ని దూరం చేస్తుందన్నారు. పాఠ్యపుస్తకాల్లో నుంచి జాతీయ ఉద్యమ వీరుల పోరాట త్యాగాలను, సమానత్వాన్ని బోధించే సోషలిస్టు భావాలను, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాలను తొలగించి, కుల, మత, మనువాద, అశాస్త్రీయ భావాలను ప్రవేశ పెడుతున్నదన్నారు.

నేటి విద్యార్థి, యువత భగత్ సింగ్, రాజ్ గురు,సుఖ్ దేవ్ ల పోరాట స్ఫూర్తితో విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం పోరాడాలని, ఇరాన్ పై ఇజ్రాయిల్ -అమెరికా కొనసాగిస్తున్న యుద్ధోన్మాధ దాడులను ఖండించాలని, దేశంలో రోజురోజుకు పెట్రేగిపోతున్న కుల, మతోన్మాద పాసిజాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో PDSU తెలంగాణ యూనివర్సిటీ నాయకులు నితిన్, అంజలి, హేమ, రాజేష్, తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకులు లక్ష్మణ చక్రవర్తి, స్వామి, శ్రీనివాస్, పుప్పాల రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...
Translate »
error: Content is protected !!