నిజామాబాద్,నగరంలోని బసవ గార్డెన్లో నిజామాబాద్ అర్బన్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన బాధ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యం సమాజంలో నాలుగో స్తంభమైన జర్నలిజం వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని పేర్కొన్నారు.నిజామాబాద్ జర్నలిస్టుల చిరకాల కోరిక అయిన ఇళ్ల స్థలాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము గుర్తిస్తున్నామని, వారి ఆరోగ్య భద్రత (హెల్త్ కార్డ్స్) విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.
వార్తల సేకరణలో వాస్తవాలకు ప్రాధాన్యతనిస్తూ, పేదల గొంతుకగా నిలవాలని ఆయన నూతన కార్యవర్గానికి సూచించారు.టిఆర్పి రేటింగ్ గురించి , ఆలోచించకుండా వాస్తవాలు మాత్రమే వెలుగులోకి తీసుకురండి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ,ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలి పాత్రికేయుల పోరాట పటిమను అభినందించారు.ఒక నాయకుడు ఎదగాలన్న మీడియా సహకారంతో ఎంతో అవసరం ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వానికి వివరించడంలోనూ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు.నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎమ్మెల్సీగా తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికల ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























