వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరమ్మతులు చేసి అభివృద్ధి చేసిన పోలీస్ అతిథి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి . శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సాయంత్రం హన్మకొండ పోలీస్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న డిజిపి వరంగల్ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. సాయుధ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన డిజిపి అనంతరం పునరుద్ధరించిన ఆధునిక సదుపాయాలతో రూపొందించిన పోలీస్ అతిథి గృహాన్ని ప్రారంభించారు.
పోలీస్ శాఖ అధికారుల, అతిథుల వసతి సౌకర్యాలను మెరుగుపరచే దిశగా ఈ అతిథి గృహం పునర్నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆధునిక సదుపాయాలతో, సౌకర్యవంతమైన వాతావరణంలో రూపొందించిన ఈ అతిథి గృహం భవిష్యత్లో శాఖకు మరింత ఉపయోగకరంగా ఉండనుందని డిజిపి తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనరేట్కు చెందిన డీసీపీలు అంకిత్ కుమార్, కవిత, శుభం నాగ్, అదనపు డీసీపీ లు రవి, శ్రీనివాస్, సురేష్ కుమార్, తో పాటు ఏసీపీలు ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.























