నిజామాబాద్ జిల్లా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ..వాటి పరిష్కారానికి కృషి చేస్తూ..ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా పనిచేసేది మీడియా అని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.
సోమవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని స్థానిక బస్వా గార్డెన్ లో ఏర్పాటు చేయగా.. టీపీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నగర మేయర్ ఉమారాణి లతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సంబద్భంగా ప్రెస్ క్లబ్ నూతన అద్యక్షులు పంచశెట్టి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి డా.వాగ్మారే సుభాష్ లతో పాటు కార్యవర్గ సభ్యులను అభినందించి..శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మేరకు ఎమ్మేల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ, శాసనసభ,
కార్యనిర్వాహక వ్యవస్థల తర్వాత మీడియాను ‘నాల్గవ స్తంభం’గా పిలుస్తారని పునరుద్ఘాటించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు విజయంలో తప్పకుండా ప్రయత్నం చేస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మేల్యే వెంట ఏఎంసి చైర్మన్ ముప్ప గంగారెడ్డి,జర్నలిస్టులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.























