బీడీ కార్మికుల జీవన భృతిని రూ.4 వేలకు పెంచాలి: సీఐటీయూ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
బీడీ కార్మికుల జీవన భృతిని ప్రస్తుత స్థాయి నుంచి రూ.4 వేలకు పెంచాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు ఏ. రమేష్ బాబు మాట్లాడారు.
అర్హత కలిగిన కొత్త బీడీ కార్మికులకు జీవన భృతి పొందేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభల్లో బీడీ కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు చేసినట్లు నాయకులు తెలిపారు.
బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు పిలుపునిచ్చినట్లు సీఐటీయూ నాయకులు పేర్కొన్నారు.

























