Homeఇందూరు అర్బన్ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం తోనే పనులు నత్తనడకన నడుస్తున్నాయి

ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారుల బాధ్యతారాహిత్యం తోనే పనులు నత్తనడకన నడుస్తున్నాయి

*పరిసరాల పరిశుభ్రత బాగుంటేనే ప్రభుత్వం అనుకున్న ప్రగతి సాధించవచ్చు*

ఇందూరు అర్బన్..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మార్చి 6 నుండి జూన్ 12 వ తేదీ వరకు చేపడుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేయడం కొరకు జిల్లా కలెక్టర్  ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నప్పటికీ ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఎమ్మెల్యే  ధ్వజమెత్తారు. కేవలం కలెక్టర్  మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ప్రభుత్వం నుండి కావలసిన వసతులు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నప్పటికీ ఆయా శాఖలో ఉన్నతాధికారులు మాత్రం కిందిస్థాయి సిబ్బందికి కార్యక్రమ పనులు అప్పజెప్పి చేతులు దులుపుకోవడం విచారకరమన్నారు. అన్ని శాఖల ముఖ్య అధికారులు కలసికట్టుగా పనిచేస్తేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో జిల్లాలో ఉన్న గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల ప్రజలలోకి చిరకపోవడం ఉన్నతాధికారుల బాధ్యతారహితమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠి  ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నప్పటికీ ఆయా శాఖలలో ఉన్న ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల కిందిస్థాయి సిబ్బంది సేవలు గుర్తించకపోవడం విచారకరమన్నారు. ప్రజా పాలన ప్రగతి పాలన అంటే సమాజ అభివృద్ధి అని మరీ ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ఇందులో పరిసరాల పరిశుభ్రత ఎక్కడ కూడా కనిపించడం లేదన్నారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రగతి సాధించినట్లని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ దిశగా సానిటేషన్ అధికారులు పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే ఈ కార్యక్రమం ప్రణాళిక బద్ధంగా జరగడంలేదని ఎమ్మెల్యే  దిగబట్టారు. నిజామాబాద్ నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల అవగాహన సదస్సులో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధన్‌పాల్ సూర్యనారాయణ  ముఖ్య అతిథిగా హాజరై పలు అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోవచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా జరగాలని, నగర అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాఠీ, మున్సిపల్ కమిషనర్  దిలీప్ కుమార్, నగర మేయర్ శ్రీమతి ఉమా రాణి, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.....

0
అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు... ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా... కన్నులపండుగగా శోభాయాత్ర... ఇందూరు: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్...

స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 

0
స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  ఇందూరు: జనగణన 2027 లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నగరంలోని తన...

జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ ..జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే...

0
జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ .. జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే క్షవీన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో...

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం

0
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం ఆదివారం : 26/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ...

నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం : 26/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో, నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం...

అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.....

0
అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు... ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా... కన్నులపండుగగా శోభాయాత్ర... ఇందూరు: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్...

స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 

0
స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  ఇందూరు: జనగణన 2027 లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నగరంలోని తన...

జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ ..జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే...

0
జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ .. జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే క్షవీన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో...

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం

0
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ సమ్మేళనం ఆదివారం : 26/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో విరాట హిందూ...

నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం : 26/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలంలో, నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం...
Translate »
error: Content is protected !!