దోషులకు శిక్ష పడేలా చూస్తాం కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇమ్మడి గోపి మరణం పార్టీకి తీరని లోటు
గోపి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించిన ఎమ్మల్యే
ఇటీవల హత్యకు గురైన ధర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి కుటుంబ సభ్యులను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ *ఎమ్మల్యే డా.ఆర్. భూపతి రెడ్డి* పరామర్శించారు. ఈ మేరకు శనివారం ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇమ్మడి గోపి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్ష పడేలా చూస్తామని భరోసా కల్పించారు. పార్టీ పరంగా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. 
ఈ మేరకు ఎమ్మల్యే డా.ఆర్.భూపతి రెడ్డి మాట్లాడుతూ… ఉమ్మడి గోపి మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవను స్మరించుకున్నారు. గోపి హత్యలో నిందితులు ఎవరున్నా చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయమై సీపీ,పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగిందని తెలిపిన ఎమ్మల్యే దోషులకు శిక్ష పడేలా దర్యాప్తును ముమ్మరం చేయాలని సూచించినట్లుగా తెలిపారు. ఎమ్మల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్,చింతల కిషన్, లారీ గంగారెడ్డి, ఉమ్మాజి నరేష్,రాంచందర్, పార్టీ కార్యకర్తలు,ఆయా గ్రామాల సర్పంచ్ లు,తదితరులు పాల్గొన్నారు.

























