Homeత్రిశూల్ న్యూస్ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి

ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి

ఇందిరమ్మ ఇళ్లకు నిధులు తగ్గించడం దారుణం..

ఆటో డ్రైవర్లనూ విస్మరించారు..

అసెంబ్లీలో పలు అంశాలను ప్రస్తావించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…


ఇందూరు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. గత సంవత్సరం బడ్జెట్లో 6 గ్యారంటీలకు రూ.56,083 కోట్లు కేటాయిస్తే.. ఈసారి మాత్రం 50,713 కోట్ల కే పరిమితం చేసిందన్నారు. సుమారు 5,370 కోట్లు కోత విధించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆర్ గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు. ప్రస్తుతం కేటాయించిన నిధులు కూడా పూర్తిగా ఖర్చు చేస్తారని నమ్మకం తమకు లేదన్నారు. ఎందుకంటే గత సంవత్సరం 49,315 కోట్లు కేటాయింపులు చేసి 24 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.

అలాగే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మల్లో నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం… బడ్జెట్ లో మాత్రం నిధులను భారీగా కోత విధించిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గత సంవత్సరం 12,571 కోట్లు కేటాయిస్తే ఈసారి మాత్రం కేవలం 5500 కోట్లు కేటాయించడం దారుణం అన్నారు. సుమారు 7 వేల కోట్లు కోత విధించిందన్నారు. మరో విచిత్రం ఏమిటంటే గత మూడు బడ్జెట్లలో కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించిన నిధుల్లో కేవలం 300 కోట్లు మాత్రమే తెలిపారు.  ఉచిత బస్సు పథకం ద్వారా వేలాదిగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించిందని చెప్పారు. కానీ ఈ బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు మొండి చేయి చూపించిందన్నారు. ఏడాదికి రూ.12 వేల భృతి, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని అన్నారు. అలాగే ఎస్సీ సంక్షేమానికి గత సంవత్సరంలో 40 వేల కోట్లు నిధులు కేటాయించగా ఈసారి 11 వేలకు పరిమితం చేయడం దారుణం అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుత బడ్జెట్ నిరాశ కలిగించిందని తక్షణమే సవరణ చేయాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

ఆర్‌ఎంసి ప్లాంట్లను తరలించాలని ధయారీ వాసులు డిమాండ్ చేస్తున్నారు

0
పూణే: పూణె మునిసిపల్ కార్పొరేషన్ (పిఎంసి)ని మూసివేసి, తమ పరిసరాల్లో పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసి) ప్లాంట్‌లను తరలించాలని డిమాండ్ చేస్తూ ధయారీ నివాసితులు శుక్రవారం నిరసన ప్రదర్శన...

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం

0
ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం  నిజామాబాద్ జిల్లా లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

ఆర్‌ఎంసి ప్లాంట్లను తరలించాలని ధయారీ వాసులు డిమాండ్ చేస్తున్నారు

0
పూణే: పూణె మునిసిపల్ కార్పొరేషన్ (పిఎంసి)ని మూసివేసి, తమ పరిసరాల్లో పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసి) ప్లాంట్‌లను తరలించాలని డిమాండ్ చేస్తూ ధయారీ నివాసితులు శుక్రవారం నిరసన ప్రదర్శన...

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం

0
ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం  నిజామాబాద్ జిల్లా లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...
Translate »
error: Content is protected !!