రేకులపల్లిలో వరుస దొంగతనాలు కంటిమీద కునుకు లేదని గ్రామస్తుల ఆవేదన
మంగళవారం :31/03/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో గల రాత్రి అయినంక కట్టెలు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళు ముసలివారు అనుకునేరు సుమ ముసలివారు కాదు వారి గ్రామాన్ని దొంగల భారీన పడకుండా చూసుకోవడానికి గస్తీ దళ సభ్యులు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశపడి మోసపోకుమా నిజం మరచి నిద్రపోకుమా అన్న ఒక వ్యాఖ్యకు రేకులపల్లి గ్రామస్తులు ప్రాణం పోశారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఊరంతా ఏకమై కులానికొక్కరుగా ప్రతి ఒక్కరు వచ్చిఈ గస్తీ దళం ఏర్పాటు చేసుకోనీ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు గ్రామ వీధుల్లో 20 మంది గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రామ వీధుల్లో తిరుగుతూ వారి ఇండ్లకు వారే రక్షణ దారులుగా నిలుస్తూతున్నారు. ఈ సమయంలో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే చర్యలు తప్పవని వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

























