ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలి. ప్రత్యేక అధికారి ఎం. శ్రీనివాస్
మంగళవారం :31/03/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో భాగంగా మండల స్థాయి అధికారులచే సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి, డి. ఎల్.పి.ఓ. ఎం.శ్రీనివాస్ తెలిపారు.తాహాసిల్దార్ టి.శాంత, ఎంపీడీవో. లక్ష్మారెడ్డి, ఎంపీఓ. రాజేష్, ఎంఈఓ. రమేష్, ఏవో. వెంకటేష్, ఏఈ. పి.ఆర్.బాలాజీ, గ్రామ కార్యదర్శులు, జిపిఓలు పాల్గొన్నారు























