సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ సర్పంచ్ గుగ్లోత్ జ్యోతి గణేష్
మంగళవారం :31/03/26/మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం మరియా తండాలో ముగ్గురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ గుగ్లోత్ జ్యోతి గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే భూపతి రెడ్డి, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ సహకారంతో చెక్కులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాస్కర్, సంజీవ్, వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

























