కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల మరోసారి పెరిగాయి. నేడు (ఏప్రిల్ 1)19 కిలోల వాణిజ్య సిలిండర్పై రూ.195.50 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డోమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 2,078.50కి చేరింది.























