జి జి హెచ్, మాతా శిశు విభాగంలో సురక్షిత మాతృత్వ దినోత్సవం
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు జిల్లా ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో సురక్షిత మాతృత్వ దినోత్సవం జరిపినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గర్భిణీ స్త్రీలను 12 వారాల లోపు నమోదు చేయాలని గర్భిణీ సమయంలో వైద్యుని చేత నాలుగుసార్లు పరీక్షలు చేయించుకోవాలని, ప్రసార ప్రణాళికను ముందే చేసుకుని ఈ డి డి కంటే వారం రోజుల ముందే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి హై రిస్క్ కనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని అన్నారు. ప్రసవానంతరం తల్లిపాల ప్రాముఖ్యత టీకాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వివరించాలన్నారు. పాలిచ్చే తల్లులను 42 రోజుల వరకు మరియు శిశువులను సంవత్సరం వరకు ఎటువంటి మాతా శిశు మరణం జరగకుండా పర్యవేక్షించాలన్నారు ఆశా కార్యకర్తలు గృహ సందర్శనలో వారి వారి ప్రణాళిక కనుగుణంగా గర్భిణీ స్త్రీలను బాలింతలను తప్పకుండా కలిసి వారికి పోషకాహారం పై , వ్యాధి నిరోధక టీకాలపై మరియు వ్యక్తిగత పరిశుభ్రత పై వివరించాలన్నారు. బాన్స్వాడ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు చక్కని నాటిక ప్రదర్శించి గర్భిణీ స్త్రీ నమోదు గర్భిణీ సమయంలో హైరిస్తూ జాగ్రత్తలు పోషకాహారము ప్రసా ప్రణాళిక మొదలగంశాలపై నాటిక ప్రదర్శించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపర్డెంట్ శ్రీనివాసరావు, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జలగం తిరుపతిరావు, ఏసీపి, గైనకాలజీ హెచ్ ఓ డి అరుణ రేఖ, గైనకాలజిస్ట్లు డాక్టర్ రోహిణి, డాక్టర్ ఇందు,పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ శ్వేత, పి సి పి ఎన్ డి టి డాక్టర్ సుప్రియ, డాక్టర్ శిఖర, నర్సింగ్ సూపర్డెంట్ చంద్రకళ బాన్స్వాడ నరసింహం కళాశాల విద్యార్థినిలు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.























