ధర్పల్లిలో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవం
శుక్రవారం : 24/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, కార్యదర్శి మేళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.























