ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు
శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్ మహారాజ్ ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆలయ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు యజ్ఞ యాగాదులు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ వేడుకలకు ఐదు తండాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.























