ధర్పల్లి: రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన
శనివారం : 18/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి పాత బస్టాండ్ సమీపంలో ఎస్సై వినయ్ ఆదేశాల మేరకు పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రహదారి దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిబంధనలు తెలుసుకోవడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రవీందర్, సునీల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.























