ప్లాస్టిక్ని నిర్మూలించాలని నడిమితాండ గ్రామపంచాయతీ
శనివారం : 18/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా.ధర్పల్లి మండలం నడిమితాండ గ్రామపంచాయతీ పరిధిలోగ ఐదు తండాల ప్రజలు పూర్తిగా ప్లాస్టిక్ని నిర్మూలించాలని శనివారం నడిమితాండ గ్రామపంచాయతీలో తీర్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కేలు మాట్లాడుతూ.. నడిమి తండా గ్రామపంచాయతీ ప్రాంతంలో గల ఐదు తాండాల గ్రామ ప్రజలు ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలని ప్లాస్టిక్ కారణంగా క్యాన్సర్ బారిన పడి ఎందరో అనారోగ్యాల పాలవుతున్నారని అందువలన శనివారం గ్రామపంచాయతీలో ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టి గ్రామంలోని జగదాంబ ఆలయానికి సుమారు 300 స్టీల్ ప్లేట్లు గ్లాసులు అందించారు ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో పూర్తిగా ప్లాస్టిక్ ని నిర్మూలించి భక్తులకు స్టీల్ ప్లేట్లలో ఆహారాన్ని అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీరప్ప తాండ, నడిమి తాండ, కుంటతాండ, బలరాం తండా, లక్ష్మి చిరుతాండ, కారణాల తాండ, ప్రజలు మరియు ఉప సర్పంచ్ సతీష్ నాయక్, గ్రామపంచాయతీ సెక్రెటరీ సుమన్, విడిసి చైర్మన్ బాలు నాయక్, పూజారి బలరాం నాయక్, భుక్య లక్ష్మణ్ నాయక్, రాములు నాయక్, బాణావత్ శంకర్ నాయక్, లింబియా నాయక్, మునియా నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు



















