నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రిమియర్ లీగ్ ర్యాలీ నిర్వహణ : పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ ర్యాలీ ఉదయం DSA గ్రౌండ్ నుండి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించడం జరిగింది.
ఇట్టి లీగ్ ర్యాలీ కార్యక్రమానికి *నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* హాజరై జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుండడం ఎంతో గర్వకారణమని , నిజామాబాద్ జిల్లా నుండి ఎంతోమంది క్రీడాకారులని దేశానికి అందించినటువంటి ఘనత జిల్లాకు ఉండడం ఎంతో సంతోషకరమైన విషయం అని , ఈ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్, వాలీబాల్ , కబడ్డీ , బాస్కెట్ బాల్, యోగా మొదలగునటువంటి క్రీడలు నిర్వహిస్తున్నారని , ఇందులో అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు ఈ క్రీడలలో గెలుపొందినటువంటి వారికి ప్రైజ్ మనీ కూడా డిక్లేర్ చేయడం జరిగిందని అన్నారు. యువతను సన్మార్గంలో నడిపించాలని ఉద్దేశంతో యువతను ప్రోత్సహించే విధముగా ఈ యొక్క సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నరని , కోవిడ్ సమయంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 మంది చనిపోయారని , రోడ్డు ప్రమాదాల వలన నిజామాబాద్ జిల్లాలో 2025 సంవత్సరంలో 300 మంది మరణించారని ప్రధానముగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని పాటించకపోవడం వలన ఈ యొక్క ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గమనించాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారు క్షేమంగా తమ గమ్యానికి చేరుకుంటున్నారని కాబట్టి ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని తెలియజేశారు యువత డ్రగ్స్ మరియు సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు ప్రతి ఒక్కరితో *సే నో టు డ్రగ్స్ , సే ఎస్ టూ స్పోర్ట్స్* అనే నినాదం చేయించడం జరిగింది. యువత మీదనే దేశ భవిష్యత్తు ఆధారాలు ఉంటుందని యువత సన్మార్గంలో నడిచినప్పుడే అది సాధ్యమవుతుందని అందుకే ఈ యొక్క సమ్మర్ క్యాంపు ద్వారా ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేశామని తెలియజేశారు.
అనంతరం కాగడా తో క్రీడా ర్యాలీని ప్రారంభించి, ఇట్టి క్రీడా ర్యాలీ పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి కోర్టు చౌరస్తా , మున్సిపల్ కార్యాలయం , ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ కార్యాలయం , విజయ్ థియేటర్ , రైల్వే కమాన్ , అయ్యప్ప దేవాలయం , మీ-సేవ , పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ మరియు NSC చైర్మన్ సాయి చైతన్య , DCP బస్వా రెడ్డి , జనరల్ సెక్రెటరీ కవిత రెడ్డి , స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి , జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్ , ట్రెజరర్ సంతోష్ మరియు వివిధ విభాగాల్లో జాయింట్ సెక్రటరీలు శిరీష్ , పితాని , శివప్రసాద్ , గణేష్ గుప్తా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ , నిజామాబాద్ యువత, క్రీడాకారులు మరియు విద్యార్థులు పాల్గొని దిగ్విజయం చేశారు.





















