ధర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నుల పంపిణీ
మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న శ్రీ సరస్వతి దేవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉపసర్పంచ్ తేజ శ్రీకాంత్, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెడ్మాస్టర్) మరియు ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని నోట్బుక్స్, పెన్నులను స్వీకరించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

























